Sunday 1 July 2012

జన్మదినమని ఆహ్వానించి గ్యాంగ్ రేప్.. విశాఖలో ఘోరం

ఇద్దరు యువతులను పుట్టిన రోజు వేడుకల పేరిట ఆహ్వానించి గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఘటన విశాఖపట్టణంలో వెలుగుచూసింది. సాటి మహిళలపై తన భర్త, సోదరుడితో సహా మరో ఇద్దరు వ్యక్తులు దుశ్చర్యకు పాల్పడుతున్న సమయంలో వారిని అడ్డుకోవాల్సింది పోయి.. జరుగుతున్న దాన్ని అంతటినీ వినోదం మాదిరిగా చూస్తుండి పోయింది మరో అతివ. 

డి.శ్రీకాంత్ అనే వ్యక్తి విశాఖలో కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తుంటాడు. అతని వద్ద ఇద్దరు యువతులు ఉద్యోగం చేసి ఇటీవలే మానేసారు. వారికి మూడు నెలల జీతాన్ని శ్రీకాంత్ బకాయిపడ్డాడు. తమ జీతం గురించి పలుమార్లు వారు శ్రీకాంత్‌ దగ్గరకు వచ్చిపోతుండేవారు. 

జీతం కోసం గతవారం శ్రీకాంత్‌ను కలవగా అతగాడు వారిని శనివారం నాడు తన ఇంటికి ఆహ్వానించాడు. తన ఇంట్లో తన పుట్టినరోజు కార్యక్రమానికి హాజరైన తర్వాత వారికివ్వవలసిన జీతాన్ని ఇచ్చేస్తానని హామీ ఇవ్వడంతో వారు అతని ఇంటికి వెళ్లారు.

అమాయకంగా తనను నమ్మి వెళ్లిన యువతులకు కూల్ డ్రింకులలో మత్తుమందు కలిపి ఇచ్చారు. ఆ తర్వాత వారిపైకి శ్రీకాంత్ తన భార్య రత్నంను ఎగదోశాడు. ఆమె వారిని ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ దాడి చేసింది. ఆ తర్వాత రత్నం సోదరుడు అచ్చిరాజు(శ్రీకాంత్ బావమరిది) రంగంలోకి దిగి వారిపై చేయి చేసుకున్నాడు. అతనికి శ్రీకాంత్ స్నేహితులు వల్లి, శ్రీనులు తోడయ్యారు. వారు అపస్మారక స్థితికి చేరుకోగానే వారిపైకి రత్నం దాడికి దిగింది. 

తర్వాత శ్రీకాంత్, అతని బావమరిది, స్నేహితులు మూకుమ్మడి అత్యాచారానికి దిగారు. తాము చేసిన అఘాయిత్యాన్ని వారు సెల్‌ఫోన్‌లో కూడా చిత్రీకరించారని పోలీసులు చెప్పారు. సాటి మహిళగా దీన్ని అడ్డుకోకుండా రత్నం సహకరించింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు శ్రీకాంత్‌ను అతని బావమరిదిని అరెస్టు చేసారు. శ్రీకాంత్ భార్య, మిగిలిన స్నేహితులు పరారీలో ఉన్నారు.

No comments:

Post a Comment